సీఎం జగన్‌ను కలిసిన శ్రీజగద్గురు నిరంజనా నందపురి

CM Jagan: తిరుమలలో కనకదాసు గురుపీఠం మఠం నిర్మించేందుకు.. భూమిని కేటాయించాలని విజ్ఞప్తి

Jyothi
Published on: 14 Feb 2023 6:06 PM IST
Shri Jagadguru Niranjana Nandapuri Meet CM Jagan
X

సీఎం జగన్‌ను కలిసిన శ్రీజగద్గురు నిరంజనా నందపురి

CM Jagan: తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కర్ణాటక కగినెలె కనకదాసు గురుపీఠాధిపతి జగద్గురు నిరంజనా నందపురి మహాస్వామి, కర్ణాటక మంత్రి నాగరాజు, మాజీ మంత్రి రేవణ్ణ సీఎం జగన్‌ను కలిశారు. తిరుమలలో కనకదాసు గురుపీఠం మఠం నిర్మించేందుకు భూమిని కేటాయించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. వారి విన్నపానికి సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. తిరుమల క్ష్రేత్రంలో తమ కురబ సామాజిక వర్గానికి ఇప్పటి వరకు మఠం లేదని, లక్షలాదిమంది స్వామి వారి భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారని సీఎం జగన్‌కు వివరించారు.

Jyothi

Jyothi

Next Story