అర్హులైన ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా అందజేయాలి

అర్హులైన ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా అందజేయాలి
x
సిపిఐ కార్యదర్శి చంద్రశేఖర్ మరియు నియోజకవర్గ రైతు సంఘం నాయకులు
Highlights

మండలంలోని అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా అందజేయాలని సిపిఐ పార్టీ నాయకులు విలేకరుల సమావేశంలో అన్నారు.

నల్లమాడ: మండలంలోని అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా అందజేయాలని సిపిఐ పార్టీ నాయకులు విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన రైతులకు అనేక కారణాల వల్ల రైతు భరోసా అందడం లేదన్నారు. సాంకేతిక కారణాల వల్ల రైతులకు అందాల్సిన రైతు భరోసా అర్హులైన ప్రతి రైతుకు అందజేయాలని వారు డిమాండ్ చేశారు. గడువు విధించడం వల్ల అర్హులైన రైతులకు కూడా రైతు భరోసా కోల్పోవడం జరుగుతోందని రైతు భరోసాకు గడువు లేకుండా నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని తెలిపారు.

వేరుశనగ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుండి ప్రభుత్వమే వేరుశనక్కాయలు కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. ధరల నియంత్రణ నిధిని ఏర్పాటు చేసి రైతులు పండించే పంటలకు మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల సిపిఐ కార్యదర్శి చంద్రశేఖర్ తో పాటు నియోజకవర్గ రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories