Anantapur: రోడ్డు ప్రమాదం.. ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కేడే మృతి

Anantapur: ప్రమాద స్థలంలో కంటెయినర్‌లో 5గురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం

Jyothi
Published on: 7 Feb 2024 11:48 AM IST
Road Accident In Anantapur
X

Anantapur: రోడ్డు ప్రమాదం..ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కేడే మృతి... 

Anantapur: అనంతపురం జిల్లా పెడ్డవడగురు మండలం కాసేపల్లి టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణలోని పెబ్బేరు నుంచి అనంతపురం వైపు అవులను తరలిస్తున్న కంటెయినర్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఘటనలో ఇద్దరు వ్యక్తులు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. సుమారు 40 అవులతో మరణించాయి.. అర్ధరాత్రి ప్రమాదం జరగడంతో ఆలస్యంగా గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

కంటెయినర్‌లో అవులతోపాటు ఐదుగురు వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.. మృతుల వివరాలు సేకరిస్తున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం పామిడికి తరలించారు.

Jyothi

Jyothi

Next Story