లంగర్లకు చిక్కిన బోటు..బయటకు తీసేందుకు యత్నిస్తున్న సత్యం బృందం..

లంగర్లకు చిక్కిన బోటు..బయటకు తీసేందుకు యత్నిస్తున్న సత్యం బృందం..
x
Highlights

తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర ప్రమాదానికి గురైన పడవను వెలికి తీసేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా బోటు మునిగిన చోట...

తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర ప్రమాదానికి గురైన పడవను వెలికి తీసేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా బోటు మునిగిన చోట ఐదు లంగర్లు వేసింది సత్యం టీమ్. నీటి అడుగు భాగంలో రెండు లంగర్లు గట్టిగా పట్టుకున్నాయి. దీంతో అవి బోటుకే తగులుకుని ఉంటాయని భావిస్తున్నారు. లంగర్లకు కట్టిన ఐరన్‌ రోప్‌లను ప్రొక్లెయినర్‌తో లాగుతోంది సత్యం బృందం. బోటు వెలికితీత నేపథ్యంలో ఆ ప్రాంతానికి ఎవరూ రావొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో భాగంగా ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories