Visakhapatnam: విశాఖలో క్రైమ్‌ రేట్‌‌ను తగ్గించేందుకు పోలీసుల చర్యలు..

Visakhapatnam: 280 మంది రౌడీషిటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన త్రివిక్రమవర్మ

Shekhar G
Published on: 21 Jun 2023 2:04 PM IST
Police Trying  To Reduce Crime Rate In Visakhapatnam
X

Visakhapatnam: విశాఖలో క్రైమ్‌ రేట్‌‌ను తగ్గించేందుకు పోలీసుల చర్యలు..  

Visakhapatnam: ఎంపీ కుటుంబసభ్యుల కిడ్నాప్‌తో విశాఖ పోలీసులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. విశాఖలో క్రైమ్‌ రేట్‌ను తగ్గించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. A-కేటగిరి రౌడీషీటర్లకు కమిషనర్ త్రివిక్రమవర్మ కౌన్సిలింగ్ ఇచ్చారు. 280 మంది రౌడీషిటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు త్రివిక్రమవర్మ తెలిపారు. నేరాలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని రౌడీ షీటర్లను హెచ్చరించారు. మాట వినకపోతే పీడీ యాక్ట్ పెడతామన్నారు. విశాఖలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని. రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ కొనసాగుతుందన్నారు.

Shekhar G

Shekhar G

Next Story