Kuppam: టీడీపీ కార్యకర్తలపై పోలీసుల దాడి.. తిరగబడ్డ జనం.. వెనుదిరిగి వెళ్ళిపోయిన..

Police Over Action on TDP Activists in Kuppam
x

Kuppam: టీడీపీ కార్యకర్తలపై పోలీసుల దాడి.. తిరగబడ్డ జనం.. వెనుదిరిగి వెళ్ళిపోయిన..

Highlights

Kuppam: చిత్తూరు జిల్లా శాంతిపురంలో ఉద్రిక్తత నెలకొంది.

Kuppam: చిత్తూరు జిల్లా శాంతిపురంలో ఉద్రిక్తత నెలకొంది. గడ్డూరు క్రాస్ వద్ద టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు కుప్పం పర్యటనకు వెళ్లకుండా వారిని ఆపేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుపై పార్టీ నాయకులు మండిపడుతున్నారు.

వడ్డివాని‌ కొత్తూరు వద్ద టీడీపీ కార్యకర్తలపై పోలీసుల దాడి చేశారు. హరీష్ అనే వ్యక్తికి ముఖంపై రక్తపు గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహించిన కార్యకర్తలు పోలీసులపై తిరగబడ్డారు. విషయం తెలుసుకున్న పార్టీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. ఆతర్వాత పోలీసులు వెనుదిరిగి వెళ్లిపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories