PM Modi: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ప్రధాని మోడీ

PM Modi: పుట్టపర్తిలో శ్రీసత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

Arun Chilukuri
Published on: 19 Nov 2025 1:34 PM IST
PM Modi: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ప్రధాని మోడీ
X

PM Modi: పుట్టపర్తిలో శ్రీసత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ప్రధాని మోడీ హాజరయ్యారు. పుట్టపర్తి ఎయిర్‌పోర్ట్‌ నుంచి రోడ్డుమార్గాన పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి చేరుకున్న ఆయన.. శ్రీసత్యసాయి మహా సమాధిని సందర్శించారు. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కూడా ఉన్నారు.

ఈ సందర్భంగా మోడీకి వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం పలువురు రైతులకు ప్రధాని మోడీ గోదానం చేశారు. ఇక శ్రీసత్యసాయిబాబా స్మారక నాణెం, స్టాంప్ విడుదల చేయనున్నారు మోడీ. 100 రూపాయల నాణెంతో పాటు స్టాంప్‌ విడుదల చేయనున్నారు. హిల్ వ్యూ స్టేడియంలో శ్రీసత్యసాయిబాబా జయంతి వేడుకలు జరుగుతుండగా ఈ నెల 23 వరకు సత్యసాయి శతజయంతి ఉత్సవాలు కొనసాగనున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story