Jammalamadugu: అర్హులందరికి ఫించన్,రేషన్ కార్డులు ఇవ్వాలి: టీడీపీ

Jammalamadugu: అర్హులందరికి ఫించన్,రేషన్ కార్డులు ఇవ్వాలి: టీడీపీ
x
Highlights

అర్హులైన పేదలందరికి ఫించన్ లు, రేషన్ కార్డులు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నాయకులు పి.గిరిధర్ రెడ్డి, మురళీధర్ రెడ్డిలు డిమాండ్ చేశారు.

జమ్మలమడుగు: అర్హులైన పేదలందరికి ఫించన్ లు, రేషన్ కార్డులు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నాయకులు పి.గిరిధర్ రెడ్డి, మురళీధర్ రెడ్డిలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి... ఆర్డీవో నాగన్నకు వినతిపత్రం అందజేశారు. అనంతరం గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ... జమ్మలమడుగులో 36,870 ఫింఛన్ లు మంజూరు చేశారని అన్నారు.

ప్రస్తుతం ఈ ఫింఛన్ల పై పలు రకాల ఆంక్షలు పెట్టి తొలగించడం సరికాదన్నారు. అలాగే రేషన్ కార్డులు తొలగించి పేదలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ... అర్హులైన వారికి ఫింఛన్, రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories