AP News: పులివెందులలో కాల్పుల కలకలం.. ఒకరి మృతి

AP News: కడప జిల్లా పులివెందులలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది.

Arun Chilukuri
Published on: 28 March 2023 4:28 PM IST
One Dead in Exchange of Fire in Pulivendula
X

AP News: పులివెందులలో కాల్పుల కలకలం.. ఒకరి మృతి

AP News: కడప జిల్లా పులివెందులలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. భరత్‌ యాదవ్ అనే వ్యక్తి ఇద్దరిపై కాల్పులు జరిపారు. దిలీప్, మస్తాన్‌పై భరత్ యాదవ్ జరిపిన కాల్పుల్లో.. దిలీప్ మృతి చెందగ, మస్తాన్‌కు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఘటనకు ఆర్థిక లావాదేవీలే కారణమని సమాచారం అందుతోంది. వివేకా కేసులో గతంలో సీబీఐ అధికారులపై భరత్‌ ఆరోపణలు కూడా చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story