నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య

నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య
x
Highlights

ఏపీ కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య కలకలం సృష్టించింది.

ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆదివారం సాయంత్రం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న దుర్ఘటన. కృష్ణాజిల్లా నూజివీడు లో గల రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం పరిధిలోని నూజివీడు ట్రిపుల్ ఐటి క్యాంపస్ లో రామోజీ శ్రీ భాగ్యలక్ష్మి మూడవ సంవత్సరం సిఎస్సి ఇంజనీరింగ్ చదువుతోంది. గర్ల్స్ హాస్టల్ మూడవ అంతస్తులోని కే2 రూమ్ నెంబర్ 58 లో ఆదివారం సాయంత్రం ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్నేహితులు, సిబ్బంది పరిశీలించే సమయానికే విద్యార్థి మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లుగా నూజివీడు డి.ఎస్.పి శ్రీనివాసులు విలేకరులకు తెలియజేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories