ప్రకాష్ లో "డిజిటాల్" జాతీయ స్థాయి సదస్సు

ప్రకాష్ లో డిజిటాల్ జాతీయ స్థాయి సదస్సు
x
ప్రిన్సిపాల్ డాక్టర్ కె. వీర్రాజు, వైస్ ప్రిన్సిపాల్ పెనుగొండ సుబ్బారావు, డిజిటల్ కన్వీనర్ కుమార్
Highlights

స్థానిక శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అనుబంధ సంస్థ అయిన స్పేసెస్ డిగ్రీ కళాశాలలో "డిజిటాల్ - 2019" జాతీయ స్థాయి సదస్సు నిర్వహించారు.

తుని: స్థానిక శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అనుబంధ సంస్థ అయిన స్పేసెస్ డిగ్రీ కళాశాలలో "డిజిటాల్ - 2019" జాతీయ స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్, స్కూల్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ డా. దిగంబర్ పవార్, టెక్ మహీంద్రా లొకేషన్ హెడ్ రవిచంద్ర పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి సుమారు 500 మంది విద్యార్థులు వివిధ జిల్లాల నుంచి హాజరయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. వీర్రాజు తెలియజేశారు. క్విజ్, పేపర్ ప్రజెంటేషన్ లో ప్రథమ ,ద్వితీయ స్థానాలు గెలుపొందిన విద్యార్థులకు నగదు, మెరిట్ సర్టిఫికెట్లు, మెడల్స్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ పెనుగొండ సుబ్బారావు, శ్రీ ప్రకాష్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రిన్సిపల్ రవికుమార్, డిజిటల్ కన్వీనర్ కుమార్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories