ఆ దేశం వస్తువులు ఇక్కడ అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు

ఆ దేశం వస్తువులు ఇక్కడ అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు
x
Actor Nagababu(file photo)
Highlights

గాడ్సేదేశ భక్తుడంటూ.. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకోవాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు మెగా బ్రదర్ నాగబాబు.

గాడ్సేదేశ భక్తుడంటూ.. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకోవాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు మెగా బ్రదర్ నాగబాబు. తాజాగా మరోసారి సంచలన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి చైనా, ఆ దేశ వస్తువులపై పడ్డారు. చైనా వస్తువుల నుంచి మొబైల్ యాప్‌ల వరకు అన్నీ బహిష్కరిద్దామంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం నాగబాబు ట్వీట్లు చేశారు.

బ్యాన్ చైనా ప్రొడక్ట్స్, బ్యాన్ చైనా యాప్స్.. మన దేశాన్ని ఆక్రమించుకోవలని చూస్తున్న చైనా వస్తువుల్ని, సెల్ ఫోన్ యాప్స్‌ను బహిష్కరిద్దాం. మన దేశంలో తయారైన వస్తువులను కొందాం. ప్రపంచంలో మన దేశం పెద్ద మార్కెట్. అన్ని దేశాల వస్తువులు ఇక్కడ అమ్మి సొమ్ము చేసుకొని రూ. లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. అదే మన ప్రొడక్ట్స్‌ను మనమే కొంటే మన దేశమే లాభపడుతుంది. తిరిగి ఆ డబ్బుతో మన దేశం అభివృద్ధి చెందుతుంది. మనందరం బాగుపడతాం. మన డబ్బు మన దేశంలోనే ఉంటుంది, మనమే బాగుపడదాం. అంతే కాని మన డబ్బుతో బాగుపడి మన దేశాన్ని అక్రమించుకోవలని చూసే చైనా వస్తువుల్ని బ్యాన్ చేద్దాం.'' అంటూ నాగబాబు ట్వీట్స్ చేశారు.

ముందు తెలుగు సినిమాల్లో తెలుగు నటుల్ని, తెలుగు సాంకేతిక నిపుణుల్ని, ఒరిజినల్ కథల్ని వాడండి. ఆ తర్వాత చెబుదువు గాని ఈ కథలు.'' అంటూ మరో నెటిజన్ కౌంటర్ వేశాడు. ''నీ ఫామిలీ చుట్టాలు అందరూ చక్కగా TikTok వాడుతున్నారు.. నువ్వేమో ఇక్కడ పిట్ట కథలు చెప్తున్నావ్. అంటూ మరో నెటిజన్ కామెంట్స్ చేసాడు.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి


Show Full Article
Print Article
More On
Next Story
More Stories