Sankhavaram: ఏలేశ్వరం మండల గ్రామాలలో పర్యటించిన ఎమ్మెల్యే పర్వత
Parvatha Purnachandra prasad
ఏలేశ్వరం: కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న తరుణంలో ఏలేశ్వరం మండలం లోని గ్రామాల్లో ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ పర్యటించారు. తొలుత ఏలేశ్వరం మున్సిపల్
కమిషనర్ తో సమావేశమై కరోనా వైరస్ పై తీసుకుంటున్న చర్యలపై సమీక్షలు నిర్వహించారు. తర్వాత ఏలేశ్వరం మండలం లోని తిరుమాలి, లింగంపర్తి,మర్రివీడు గ్రామాల్లో పర్యటించి ఆయా గ్రామాల్లో కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ మైక్ తీసుకుని ప్రచారం నిర్వహించారు.
Next Story




