బీసీలపై చంద్రబాబుది కపటప్రేమ: మంత్రి శంకర్ నారాయణ

బీసీలపై చంద్రబాబుది కపటప్రేమ: మంత్రి శంకర్ నారాయణ
x
మంత్రి శంకర్ నారాయణ
Highlights

చంద్రబాబు నాయుడు చిల్లర రాజకీయాలు ఇప్పటికైనా మానుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ హెచ్చరించారు.

పెనుకొండ: చంద్రబాబు నాయుడు చిల్లర రాజకీయాలు ఇప్పటికైనా మానుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ హెచ్చరించారు. శనివారం పెనుకొండలో మంత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగింది. అచ్చెన్నాయుడు, పితానిలు వందల కోట్లు రూపాయల అవినీతికి పాల్పడ్డారు. ఉపాధి హామీల పేరుతో వందల కోట్లు దుర్వినియోగం చేశారు. దీంతో చంద్రబాబు అండ్ కోకి భయం పట్టుకుంది, చంద్రబాబు బీసీలపై ప్రభుత్వం కక్షకట్టిందని బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాడు. అన్ని విధాలా బీసీలను ఆదుకున్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమే అన్నారు.

చంద్రబాబు తన అవినీతిపై సిట్ వేయడంతో వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సిట్ విచారణలో టీడీపీ నేతల అవినీతి రుజువై జైలు శిక్ష అనుభవించడం ఖాయం. చంద్రబాబు స్టేలబాబు, మీడియా మేనేజర్, తెలుగుదేశం మీడియాని అడ్డు పెట్టుకుని బ్రతికే పార్టీ చిన్నవిషయాలకు మీడియా ముందు లొల్లి చేసే బాబు ఎక్కడ దాక్కున్నాడు. తన పిఎస్ పై జరిగిన అవినీతి దాడుల్లో బైటపడ్డ వేలకోట్ల కుంభ కోణాలపై చంద్రబాబు ఎందుకు నోరు విప్పడంలేదు. ధైర్యం ఉంటే సిట్ విచారణను ఎదర్కోవాలి అన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories