Visakhapatnam: విశాఖలో భారీ ఎన్‌కౌంటర్‌

Maoists, Police Exchange Fire in Visakhapatnam
x

మావోయిస్టులు(ఫైల్ ఇమేజ్ )

Highlights

Visakhapatnam: విశాఖలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది.

Visakhapatnam: విశాఖలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. కొయ్యూరు అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు. మృతుల్లో పలువురు మహిళా మావోయిస్టులు ఉన్నట్టు గుర్తించారు. ఘటనాస్థలం నుంచి ఆయుధాలు, సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మావోయిస్టులు ఉన్నార‌న్న స‌మ‌చారంతో మంప పీఎస్ ప‌రిధిలో పోలీసులు కూంబింగ్ చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో తెల్ల‌వారుజామున ఇరు వర్గాల మధ్య కాల్పులు జ‌రిగాయి.

ఎవ‌రు చ‌నిపోయారు.. ఎంత మంది గాయ‌ప‌డ్డారో తెలియాల్సి ఉంద‌ని కొయ్యూరు సీఐ వెంకటరమణ తెలిపారు. ద‌ట్ట‌మైన అట‌వీ ప్రాంతం కావ‌డంతో వివ‌రాలు తెలియ‌డానికి స‌మ‌యం ప‌డుతుంద‌ని వివ‌రించారు. ప్ర‌స్తుతం ఈ ప్రాంతంలో కూంబింగ్ కొన‌సాగుతోంద‌ని చెప్పారు. ఘ‌ట‌నాస్థ‌లికి అద‌న‌పు బ‌ల‌గాల‌ను త‌ర‌లిస్తున్నామ‌న్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories