జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ట్విట్టర్ లో లోకేష్ విమర్శలు

జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ట్విట్టర్ లో లోకేష్ విమర్శలు
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని టార్గెట్ చేశారు మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ లో విమర్శలు వర్షం...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని టార్గెట్ చేశారు మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ లో విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. ట్వీట్‌లో జగన్ మాయా ప్రభుత్వం.. రైతుల పేరుతో వికృత రాజకీయం మొదలుపెట్టి అసెంబ్లీ సాక్షిగా అడ్డంగా దొరికిపోయారు అంటూ విమర్శించారు లోకేష్. బడ్జెట్ కాగితాల్లో 1,513 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్తూ, అందులో 391 మందివి మాత్రమే రైతుల ఆత్మహత్యలు అని తేల్చారని. అదే అసెంబ్లీ సమావేశాల్లో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా 1160 రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెబుతూ, అందులో 454 మందివి రైతుల ఆత్మహత్యలని చెప్పారన్నారు. ఇక టీడిపి హయాంలో రైతుల ఆత్మహత్యలు అంటూ దొంగలెక్కలు మాని మీ నాన్నగారి హయాంలో చనిపోయిన 15 వేలమంది రైతులకు ఓదార్పునివ్వాలని ప్రార్థన అంటూ లోకేష్ విమర్శించారు..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories