కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్

కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్
x
న్యాయమూర్తి ఎం. శ్రీధర్, న్యాయవాదులు మంతెన సూర్యనారాయణ రాజు, బర్ల రవి కుమార్
Highlights

కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ ఎంతగానో దోహదపడుతుందని తుని ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి ఎం. శ్రీధర్ పేర్కొన్నారు.

తుని: కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ ఎంతగానో దోహదపడుతుందని తుని ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి ఎం. శ్రీధర్ పేర్కొన్నారు. శనివారం కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయ స్థానాల్లో కేసులు పేరుకుపోవడం వల్ల పరిష్కారంలో జాప్యం జరుగుతుందని, కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు.

ఇరువర్గాలకు రాజీ మార్గం కుదిర్చి కేసును పరిష్కరించాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. లోక్ అదాలత్ కు కక్షిదారుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు మంతెన సూర్యనారాయణ రాజు, బర్ల రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories