Kodali Nani: నలుగురిని లాక్కున్నారు.. వచ్చే ఎన్నికల్లో నాలుగు సీట్లే వస్తాయి

Kodali Nani: పేద ప్రజల శ్రేయస్సు కోసం ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు.

Arun Chilukuri
Published on: 29 March 2023 5:54 PM IST
Kodali Nani Slams Chandrababu
X

Kodali Nani: నలుగురిని లాక్కున్నారు.. వచ్చే ఎన్నికల్లో నాలుగు సీట్లే వస్తాయి

Kodali Nani: పేద ప్రజల శ్రేయస్సు కోసం ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఎన్టీఆర్‌ను అన్ని వర్గాల ప్రజలు ఆదరించారు. ఎన్టీఆర్‌ చనిపోయిన తర్వాత కూడా ఆయన పేరును ప్రజలంతా స్మరిస్తున్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పార్టీని చంద్రబాబు లాక్కున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని చంద్రబాబుపై కొడాలి నాని విమర్శలు గుప్పించారు. 2014లో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కోనుగులు చేశారని.. 2019లో టీడీపీకి 23 సీట్లే వచ్చాయన్నారు. ఇప్పుడు నలుగురిని లాక్కకున్నారు.. వచ్చే ఎన్నికల్లో నాలుగు సీట్లే వస్తాయని కొడాలి నాని ఎద్దేవా చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story