కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

Chandrababu Naidu: కర్నూల్‌లో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 23 Sept 2024 7:40 PM IST
Chandrababu Naidu
X

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. కర్నూల్‌లో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. న్యాయశాఖపై సమీక్షలో భాగంగా.. హైకోర్ట్ అంశంతో పాటు పలు అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించారు చంద్రబాబు.

అమరావతిలో 100 ఎకరాల్లో లా కాలేజ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే..జూనియర్ న్యాయవాదులకు 10 వేల గౌరవ వేతనం ఇవ్వాలని అభిప్రాయపడ్డ సీఎం చంద్రబాబు..వీటన్నింటిపై వచ్చే కేబినెట్‌లో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story