Kadapa: చంద్రబాబును ఏమీ చేయలేరు: టీడీపీ

Kadapa: చంద్రబాబును ఏమీ చేయలేరు: టీడీపీ
x
Highlights

వైసీపీ ప్రభుత్వం వల్ల, సీఎం వ్యక్తిత్వం వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

కడప: వైసీపీ ప్రభుత్వం వల్ల, సీఎం వ్యక్తిత్వం వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ట్రంప్ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ఆహ్వానం అందకపోవడం రాష్ట్ర ప్రజలకు అవమానం అని తెలిపారు. టీడీపీ ప్రవేశపెట్టిన పథకాలకు పేరు మార్చి వైసీపీ అమలు చేస్తోందని, పెండింగ్ ప్రాజెక్టులన్నీ ఎక్కడివక్కడే పడకేసి ఉన్నాయన్నారు.

151 సీట్లు వచ్చాయన్న అహంకారం వైసీపీ ప్రభుత్వం లో స్పష్టంగా కనిపిస్తోందని, ఏపీ సీఎంగా చంద్రబాబు ఉండి ఉంటే ట్రంప్ పర్యటనకు ఖచ్చితంగా ఆహ్వానం అంది ఉండేదని తెలిపారు. స్థానిక సంస్థల్లో బలమైన టీడీపీ నాయకులను ఓడించాలనే కుట్రతోనే వైసీపీ పంచాయతీరాజ్ చట్టం తీసుకువచ్చిందని, చంద్రబాబును ఇబ్బంది పెట్టాలనే ప్రభుత్వం పోలీసులతో సిట్ వేసిందని ఆరోపించారు.

ఎన్ని విచారణ కమిటీలు వేసినా చంద్రబాబును ఎవరూ ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డిలు ఎన్ఆర్సీ, సీఏఏలకు వ్యతిరేకమని అసెంబ్లీలో తీర్మానం చేయాలని, లేనిపక్షంలో రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories