ఢిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా హైదరాబాద్ లో ర్యాలీ

ఢిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా హైదరాబాద్ లో ర్యాలీ
x
Highlights

* ఆల్ ఇండియా కిషన్ సంఘర్షన్ కో ఆర్డినేషన్ కమిటీ ర్యాలీ * ఈనెల 26న ర్యాలీ జరుపుకునేందుకు హైకోర్టు అనుమతి * మ. 2 గం. నుంచి సా. 5 గంటల వరకు ర్యాలీకు అనుమతి

ఢిల్లీలో జరిగే రైతుల ఆందోళనకు మద్దతుగా ఆల్ ఇండియా కిషన్ సంఘర్షన్ కో ఆర్డినేషన్ కమిటీ ఈ నెల 26న ర్యాలీ చేపట్టేందుకు కోర్టును ఆశ్రయించింది. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ర్యాలీ నిర్వహించేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది. ఎల్బీనగర్ లోని సరూర్ నగర్ స్టేడియం నుంచి ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం వరకు ర్యాలీ జరుపుకోవచ్చని అనుమతిచ్చిన హైకోర్టు ఇందిరా పార్క్ నుండి నెక్లెస్ రోడ్ వరకు ర్యాలీకి అనుమతి నిరాకరించింది. ఐతే, ఇప్పటి వరకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని కిషాన్ సంఘ్ హైకోర్టును ఆశ్రయించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories