Ponnuru: ఎన్ఆర్సీ సర్వేను నిలిపివేయాలంటూ రాస్తారోకో

Ponnuru: ఎన్ఆర్సీ సర్వేను నిలిపివేయాలంటూ రాస్తారోకో
x
Highlights

న్ఆర్సీ సర్వే నిలిపివేయాలంటూ స్థానిక గాంధీబొమ్మ సెంటర్లో ముస్లింలు ఆధ్వర్యంలో గురువారం రాత్రి రాస్తారోకో చేపట్టారు.

పొన్నూరు: ఎన్ఆర్సీ సర్వే నిలిపివేయాలంటూ స్థానిక గాంధీబొమ్మ సెంటర్లో ముస్లింలు ఆధ్వర్యంలో గురువారం రాత్రి రాస్తారోకో చేపట్టారు. ఆర్థిక సర్వే పేరిట పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో ముస్లింల ఇంటి వద్ద వచ్చిన యువకులకు ఇంటి యజమానికి మధ్య జరిగిన ఘర్షణలో ఇంటి యజమానికి గాయాలు కాగా, సర్వే పేరిట వచ్చిన యువకులను పట్టుకొని పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు.

ఈ విషయంలో పొన్నూరు రూరల్ పోలీసులు ఇరువర్గాలపై కేసు నమోదు చేయడంతో ఆగ్రహించిన ముస్లింలు పోలీసుల వైఖరికి నిరసనగా వందలాది మంది ముస్లింలతో కలిసి రాస్తారోకో చేపట్టారు. అర్బన్ సీఐ ప్రేమయ్య చొరవతో న్యాయం చేస్తానని తెలుపడంతో రాస్తారోకో విరమించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories