Anantapur: అనంతరంపురం జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

Four Killed In Road Accident Near Garladinne Anantapur District
x

Anantapur: అనంతరంపురం జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

Highlights

Anantapur: మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు

Anantapur: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామ సమీపంలోని 44 జాతీయ రహదారిపై ట్రాక్టర్‌ను వోల్వో బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. కల్లూరు రైస్‌మిల్‌ నుంచి గుత్తి మండలం మామిడూరు గ్రామానికి ట్రాక్టర్‌లో బియ్యం తీసుకెళ్తుండగా.. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న వోల్వో బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా తెలుస్తోంది. మృతులు చిన్నతిప్పయ్య, నాగార్జున, శ్రీరాములు, శ్రీనివాస్‌గా గుర్తించారు. నలుగురి మృతితో మామడూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories