శ్రీప్రకాష్ లో ముందస్తు సంక్రాంతి సంబరాలు

శ్రీప్రకాష్ లో ముందస్తు సంక్రాంతి సంబరాలు
x
Highlights

పాయకరావుపేట : స్థానిక శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల నందు శనివారం నిర్వహించిన ముందస్తు సంక్రాంతి సంబరాలు కన్నుల పండువగా జరిగాయి. పల్లెటూళ్ళ నందు రైతులు...

పాయకరావుపేట : స్థానిక శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల నందు శనివారం నిర్వహించిన ముందస్తు సంక్రాంతి సంబరాలు కన్నుల పండువగా జరిగాయి. పల్లెటూళ్ళ నందు రైతులు పంటలు చేతికి వచ్చిన తరువాత సంక్రాంతి పండుగను ఏ విధంగా జరుపుకుంటారో కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. హరిదాసు, బొమ్మలకొలువు, చిట్టి పొట్టి రైతులు, ఎద్దులబండి, గొబ్బెమ్మలు, భోగిపళ్లు తదితర వాటితో ఈ సంబరాలను కళ్ళకు కట్టినట్లుగా విద్యార్దులు చూపిన ప్రదర్శన పలువురిని ఆకట్టుకున్నాయి.

సాంప్రదాయ వస్త్ర వేషధారణలో విద్యార్ధుల చేసిన నృత్యాలు, అందమైన రంగవల్లికలతో ప్రాంగణమంతా కళకళలాడింది.పండుగల నందు జరిపే జాతరను కూడా నిర్వహించారు. శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల డైరెక్టర్ చిట్టూరి రామ సీత గోమాతలకు పూజ చేసి విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల సీనియర్ ప్రిన్సిపల్ ఎంవివిఎస్ మూర్తి మాట్లాడుతూ పండుగల విశిష్టత, ఈ సమయంలో వారు ఏ విధంగా పూజలు చేసి పండుగను జరుపుకుంటారో అనే విషయాలు విద్యార్ధులకు తెలియడం కోసం ఈ సంబరాలను నిర్వహించామని తెలిపారు.

తద్వారా విద్యార్థులు పండుగ విశిష్టత ను తెలుసుకుని మన సాంప్రదాయాలను భావి తరాలకు తెలియజేయాలనే సదుద్దేశ్యంతో ప్రతీ ఏడాది వీటిని నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు ప్రదర్సించిన గాలిపటాల ప్రదర్శన, మరియు వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమం లో అకడమిక్ ఇంచార్జి లు ఉషారాణి,సత్యవర్ధిని, ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories