ఉచిత హోమియోపతి మందుల పంపిణీ

ఉచిత హోమియోపతి మందుల పంపిణీ
x
శ్రీ వెంకటేశ్వర్లు, మాధవ నాయుడు, విద్యార్థిని, విద్యార్థులు
Highlights

బాలాజీ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర ప్రాథమిక పాఠశాల నందు గీతమై ఫౌండేషన్, తమ్మినేని కృష్ణయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హోమియోపతి మందులను ఇవ్వడం జరిగినది.

గూడూరు: బాలాజీ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర ప్రాథమిక పాఠశాల నందు గీతమై ఫౌండేషన్, తమ్మినేని కృష్ణయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థిని, విద్యార్థులకు ముందస్తుగా డెంగ్యూ, మలేరియా జ్వరం రాకుండా ఉండేందుకు ఉచిత హోమియోపతి మందులను ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు శ్రీ వెంకటేశ్వర్లు, సామాజికవేత్త మాధవ నాయుడు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పౌండేషన్ అధ్యక్షులు తమ్మినేని పాండు మాట్లాడుతూ నెల్లూరు పట్టణంలోని పేద ప్రజలు చదువుకుంటున్న అటువంటి ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు ప్రతి స్కూల్ నందు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తామని పేద విద్యార్థిని, విద్యార్థులకు హోమియోపతి మందులను ఉచితంగా ఫౌండేషన్ ద్వారా అందజేశామని తెలిపాలి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories