Ongole: టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భోజనం పంపిణీ

Ongole: టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భోజనం పంపిణీ
x
Highlights

ఒంగోలు: లాక్ డౌన్ నేపథ్యంలో ఒంగోలు అగ్రహారం ఎక్స్ టెన్షన్ దత్తాత్రేయ కాలనీ లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు టైలర్స్ అసోసియేషన్ రాష్ట్ర మహిళా...

ఒంగోలు: లాక్ డౌన్ నేపథ్యంలో ఒంగోలు అగ్రహారం ఎక్స్ టెన్షన్ దత్తాత్రేయ కాలనీ లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు టైలర్స్ అసోసియేషన్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు షేక్ సుభాన్ బి, బీసీ సమైక్య సమితి రాష్ట్ర అధ్యక్షులు ధన్నారపు మస్తాన్ రావు ఆధ్వర్యంలో ఆహార పొట్లాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా టైలర్ అసోసియేషన్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు షేక్ సుభాన్ భీ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టైలర్స్ అసోసియేషన్ జిల్లా కన్వీనర్ శ్రీను భాష, సభ్యులు వల్లూరు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories