Uravakonda: శ్రీ ఏటి గంగమ్మ దర్శనం కోసం పోటెత్తిన భక్తులు

Uravakonda: శ్రీ ఏటి గంగమ్మ దర్శనం కోసం పోటెత్తిన భక్తులు
x
Highlights

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నహోబిలం వద్ద పెన్న నది తీరంలో వెలసిన శ్రీఏటి గంగమ్మ అమ్మవారి జాతర (తిరునాళ్ళ) ఆదివారం ఘనంగా నిర్వహించారు.

ఉరవకొండ : అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నహోబిలం వద్ద పెన్న నది తీరంలో వెలసిన శ్రీఏటి గంగమ్మ అమ్మవారి జాతర (తిరునాళ్ళ) ఆదివారం ఘనంగా నిర్వహించారు. పవిత్ర మాఘ మాసంలో 3వ ఆదివారం నాడు ప్రతి ఏటా ఈ వేడుకలు జరుగుతాయి.తిరునాళ్ళ సందర్భంగా తెల్లవారుజామున నుండే పెన్నా నదిలో వేలాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. గంగమ్మ అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు.

అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఘనంగా ఊరేగించారు. ఈసందర్భంగా మంగళ ముఖిలు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.మాఘ మాసంలో ఇక్కడ పూజలు చేస్తే అంతా మంచే జరుగుతుందని భక్తుల నమ్మకం. పూజలు అనంతరం నది వడ్డునే వంటావార్పు చేసి కుటుంబాలతో కలసి భోజనాలు చేశారు. అనంతపురం జిల్లా వాసులే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా వేలాది మంది భక్తులు గంగమ్మ దర్శనం కోసం తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories