బ్యాంక్ మిత్రతో తొలగిపోనున్న కష్టాలు: డిప్యుటీ సిఎం పుష్ఫశ్రీవాణి

బ్యాంక్ మిత్రతో తొలగిపోనున్న కష్టాలు: డిప్యుటీ సిఎం పుష్ఫశ్రీవాణి
x
Highlights

వివిధ ప్రభుత్వ పథకాలకు చెందిన లబ్దిదారులకు బ్యాంకింగ్ సేవలను ఉచితంగా అందించే ‘ఏపీ వ్యాలెట్ బ్యాంకింగ్ మిత్ర’ కార్యక్రమానికి... డిప్యుటీ సిఎం పుష్ఫశ్రీవాణి కురుపాంలో శనివారం ప్రారంభించారు.

కురుపాం: వివిధ ప్రభుత్వ పథకాలకు చెందిన లబ్దిదారులకు బ్యాంకింగ్ సేవలను ఉచితంగా అందించే 'ఏపీ వ్యాలెట్ బ్యాంకింగ్ మిత్ర' కార్యక్రమానికి... డిప్యుటీ సిఎం పుష్ఫశ్రీవాణి కురుపాంలో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ.... రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ప్రవేశపెట్టిన రైతుభరోసా, అమ్మఒడి, ఆటోమిత్ర లాంటి పథకాలలో లబ్ది పొందిన వారు... బ్యాంకు ఖాతాల్లోకి ప్రభుత్వం పంపిన మొత్తాలను తీసుకోవడానికి ఇబ్బందులుపడుతుంటారని అన్నారు.

ఈ పరిస్థితుల్లో ఏపీ వ్యాలెట్ బ్యాంకింగ్ మిత్ర ఉచితంగా సేవలను అందిస్తుందని తెలిపారు. ఏపీ వ్యాలెట్ బ్యాంకింగ్ మిత్ర ద్వారా వివిధ ప్రభుత్వ పథకాల్లో లబ్ది పొందిన వారు తమ బ్యాంకు ఖాతాల నుంచి డబ్బును విత్ డ్రా చేసుకోవడం... లేదా డిపాజిట్, మరొకరికి బదిలీ చేయడం లాంటి సేవలను పొందవచ్చునని అన్నారు. బ్యాంకింగ్ సేవలతో పాటుగా ఇంటర్నెట్ సేవలను కూడా విస్తరించడానికి ఈ సంస్థ కృషి చేయనుందని తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories