ఉద్యోగం పేరిట సైబర్ దోపిడీ

ఉద్యోగం పేరిట సైబర్ దోపిడీ
x
Highlights

మర్చెంట్‌ నేవీ ఉద్యోగమంటూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన యువకుడి వద్ద నుంచి రూ.3 లక్షలు కాజేసిన సంఘటన ఇది.

విశాఖపట్నం: మర్చెంట్‌ నేవీ ఉద్యోగమంటూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన యువకుడి వద్ద నుంచి రూ.3 లక్షలు కాజేసిన సంఘటన ఇది. ఆరిలోవ సి.ఐ. కిషోర్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం ఆరిలోవ టి.ఐ.సి. పాయింట్‌ వద్ద ఉంటున్న అబ్దుల్‌ రెహమాన్‌ కొద్దిరోజుల క్రితం ఉద్యోగానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారు. దిల్లీలో ఉంటున్నట్లు పేర్కొన్న ఒరబ్రిల్‌ ప్రదీప్‌ అనే వ్యక్తి ఫోన్‌లో సంప్రదించి, ముంబయి వచ్చి, తన వ్యాపార భాగస్వామిని కలవాల్సిందిగా పేర్కొన్నాడు. రెహమాన్‌ ముంబయి వెళ్లాడు. అక్కడ ధ్రువపత్రాలను పరిశీలించిన సంజయ్‌ అనే వ్యక్తి మెడికల్‌ చేయించి, పలు సర్వీసు ఛార్జీల పేరిట రూ. 2.10 లక్షలు వసూలు చేశాడు.

తిరిగి ఇంటికి వెళ్లిపోతే విమానం టిక్కెట్లు పంపిస్తామన్నాడు. కొద్ది రోజుల తర్వాత విమానం టిక్కెట్‌ పంపించాడు. బెంగళూరు నుంచి హాంకాంగ్‌ వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. విమానం ఎక్కేలోగా ఇంకా డబ్బులు చెల్లించాల్సి ఉందని రూ. 90 వేలు వసూలు చేశాడు. విమానంలో వెళ్లడానికి బెంగళూరు వెళ్లిన రెహమాన్‌కు సదరు వ్యక్తులు ఫోన్‌ చేసి, పోర్టుకు చేరాల్సిన వెసెల్‌ రాలేదని, తిరిగి వెనక్కు వెళ్లిపొమ్మని పేర్కొన్నాడు. తర్వాత ఎన్నిసార్లు ఫోన్‌చేసినా అందుబాటులోకి రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. మొత్తం రూ. 3 లక్షలు తీసుకుని మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories