Coronavirus Updates in AP: ఏపీలో కొత్తగా 7,738 పాజిటివ్ కేసులు...

Coronavirus Updates In AP: ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు తాజాగా గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 7,738 కరోనా కేసులు నమోదయ్యాయి..

S. Srikanth
Published on: 20 Sept 2020 6:06 PM IST
Coronavirus Updates in AP: ఏపీలో కొత్తగా 7,738 పాజిటివ్ కేసులు...
X

Coronavirus Updates In AP: ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు తాజాగా గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 7,738 కరోనా కేసులు నమోదయ్యాయి.. తాజా కేసులతో కలిపి రాష్ట్రములో కరోనా కరోనా కేసుల సంఖ్య 6,25,514 కు చేరుకుంది. ఇందులో 78,836 యాక్టివ్ కేసులో ఉండగా, 5,41,3319 మంది కరోనా నుంచి కోలుకున్నారు.. తాజాగా మరో 57 మంది కరోనాతో పోరాడి మృతి చెందారు.. దీనితో మృతి చెందిన వారి సంఖ్య 5,359కి చేరుకుంది.. ఇక గడచిన 24 గంటల్లో 70,455 టెస్టుల చేయగా, మొత్తం టెస్టుల సంఖ్య 51,04,131 కి చేరుకుంది..ఈ మేరకు ఏపీ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

ఇక తాజా కేసులలో అత్యధికంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో 1,260 కేసులు నమోదు అయ్యాయి. అనంతపురం లో 539, చిత్తూరులో 794, గుంటూరులో 582, కడపలో 267, కృష్ణా జిల్లాలో 439, కర్నూలు జిల్లాలో మరో 275, నెల్లూరులో 444, ప్రకాశంలో 869, శ్రీకాకుళంలో 476, విశాఖపట్నంలో 342, విజయనగరంలో 446, వెస్ట్ గోదావరి లో 1005 కేసులు నమోదయ్యాయి.. ఇక కృష్ణా 08, అనంతపురం 07, చిత్తూరు 07, ప్రకాశం 06, విశాఖపట్నం 06, తూర్పుగోదావరి 04, కర్నూలు 04, కడప 03, శ్రీకాకుళం 03, పశ్చిమగోదావరి 03, గుంటూరు 02, నెల్లూరు 02, విజయనగరం జిల్లాలో 02 మరణించారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 86,507, కర్నూల్ జిల్లా 54,029, అనంతపురం జిల్లా 52,837, పచ్చిమ గోదావరి జిల్లా 57,746, చిత్తూర్ జిల్లా 54,853, విశాఖపట్నం జిల్లా 46,850, గుంటూరు జిల్లాలో 44,446, నెల్లూరు లో 47,727, కడప 39,531, ప్రకాశం జిల్లాలో 41,695 కేసులు నమోదయ్యాయి.




S. Srikanth

S. Srikanth

Next Story