Kurnool: కర్నూలులో కరోన అనుమానిత కేసు నమోదు

Kurnool: కర్నూలులో కరోన అనుమానిత కేసు నమోదు
x
Coronavirus in kurnool
Highlights

సర్వజన వైద్యశాలలో జోర్డాన్‌ నుంచి వచ్చిన ఓ మహిళ కోవిడ్‌-19 అనుమానంతో చికిత్స నిమిత్తం ఐసోలేటెడ్‌ వార్డులో చేరినట్లు తెలిసింది.

కర్నూలు: సర్వజన వైద్యశాలలో జోర్డాన్‌ నుంచి వచ్చిన ఓ మహిళ కోవిడ్‌-19 అనుమానంతో చికిత్స నిమిత్తం ఐసోలేటెడ్‌ వార్డులో చేరినట్లు తెలిసింది. వైద్య నివేదికల్లో పాజిటివ్‌ రాలేదని, కేవలం అనుమానితురాలిగా చేరినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ కేసు వివరాలు నిర్ధరణ కావాల్సి ఉంది. దీనిపై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, ఆసుపత్రి అధికారులు వివరాలు వెల్లడించడం లేదు.

కర్నూలు బుధవారపేటలో ఆయుష్మాన్‌ విభాగం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన వైద్య శిబిరానికి ఓ యువకుడు వచ్చారు. హాంగ్‌కాంగ్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న తాను ఇంటి నుంచే ఉద్యోగం చేయాలన్న అక్కడి ప్రభుత్వ నిబంధనతో సొంత ప్రాంతానికి వచ్చానని, తనకు పరీక్షలు చేయాలని కోరారు. కాగా, వైద్యులు, స్థానికులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. వైద్యులు ఈ విషయాన్ని డీఎంహెచ్‌వో రామగిడ్డయ్య దృష్టికి తీసుకెళ్లారు. అప్పటికే అతను తన వివరాలు ఇచ్చి వెళ్లారని, ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories