ప్రమాదంలో రాజ్యాంగం

ప్రమాదంలో రాజ్యాంగం
x
ఎస్టీ, బీసీ,మైనార్టీ, మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి
Highlights

జిల్లా ప్రస్తుత పరిస్థితుల్లో మనదేశ రాజ్యాంగంకు ప్రమాదం ఉందని ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ, మహిళా ఐక్య వేదిక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి అన్నారు.

డోన్ : జిల్లా ప్రస్తుత పరిస్థితుల్లో మనదేశ రాజ్యాంగంకు ప్రమాదం ఉందని ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ, మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అపహస్యం చేస్తూ, రాజ్యాంగానికి తూట్లు పొడవాలని చూస్తున్న మనువాద శక్తుల కుట్రలను ఎదుర్కొనేందుకు బహుజనులు ఏకం కావాలని ఆమె అన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఒకవైపు రాజ్యాంగంను తుంగలో తొక్కుతూ మరోవైపు అంబేద్కర్ ను గౌరవిస్తున్నట్లు నటించడం మోడీ ప్రభుత్వానికే చెల్లిందని ఆమె తెలిపారు. బీజేపీ,సంఘ్ పరివార్, ఆరెస్సెస్ లాంటి మనువాద శక్తుల నుండి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై వుందని ఆమె అన్నారు. 70 సంవత్సరాల రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్న ప్రతి బహుజన బిడ్డలు రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యతను తీసుకోవాలని ఆమె కోరారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories