Rayachoti: సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ

Rayachoti: సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ
x
Highlights

రాయచోటిలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో సీఎం సహయనిధి నుండి మంజూరైన 55 మందికి 29.49 లక్షల చెక్కులను ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పంపిణీ చేశారు.

రాయచోటి: రాయచోటిలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో సీఎం సహయనిధి నుండి మంజూరైన 55 మందికి 29.49 లక్షల చెక్కులను ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పంపిణీ చేశారు. రామాపురం మండలానికి సంబంధించిన ఆరు మంది లబ్ధిదారులకు 2.03 లక్షలు, లక్కిరెడ్డిపల్లి మండలానికి చెందిన నలుగురికి 3.85 లక్షలు, గాలివీడు మండలానికి చేందిన ఎనిమిది మందికి 4 లక్షలు, చిన్నమండ్యం మండలానికి చెందిన 8మందికి 3.24 లక్షలు, రాయచోటి పట్టణానికి చెందిన 14 మందికి 7.97 లక్షలు, రాయచోటి మండలానికి చెందిన నలుగురికి 2.1 లక్షలు, సంబేపల్లి మండలానికి చెందిన 9మందికి 4.05 లక్షల చెక్కులను పంపిణీ చేశారు.

ముఖ్యమంత్రి సహయనిధి ద్వారా తమను అదుకున్నందుకు లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు లబ్ధిదారులు. ఆరోగ్య సమస్యలతో ఆర్థికంగా చితికిపోయిన తమకు ముఖ్యమంత్రి సహయనిధి చేయూత నిస్తుందని వారు పేర్కొన్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories