AP Assembly: వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం

Clash Between TDP and YCP MLAs In AP Assembly
x

AP Assembly: వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం

Highlights

AP Assembly: అసెంబ్లీలో బైఠాయించి నిరసన తెలిపిన టీడీపీ ఎమ్మెల్యేలు

AP Assembly: ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామిపై వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు దాడి చేశారు. దీంతో పోడియం దగ్గర కిందపడ్డారు ఎమ్మెల్యే డోలా వీరాంజనేయ స్వామి. మరో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల దగ్గర ప్లకార్డ్ లాక్కొని నెట్టేశారు మాజీ మంత్రి వెల్లంపల్లి. దీంతో వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమ ఎమ్మెల్యేలపై దాడి చేయడంపై అసెంబ్లీలో బైఠాయించి నిరసన తెలిపారు టీడీపీ ఎమ్మెల్యేలు.

Show Full Article
Print Article
Next Story
More Stories