Chirala: మూడు రాజధానుల అంశాన్ని స్వాగతిస్తూ వంటావార్పు

Chirala: మూడు రాజధానుల అంశాన్ని స్వాగతిస్తూ వంటావార్పు
x
Highlights

పట్టణంలోని గడియారస్థంభం కూడలిలో వైసీపీ నియోజకవర్గ బాధ్యులు ఆమంచి కృష్ణ మోహన్ ఆధ్వర్యంలో... మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ బుధవారం వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.

చీరాల: పట్టణంలోని గడియారస్థంభం కూడలిలో వైసీపీ నియోజకవర్గ బాధ్యులు ఆమంచి కృష్ణ మోహన్ ఆధ్వర్యంలో... మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ బుధవారం వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు కర్నేటి రవి మాట్లాడుతూ... మూడు రాజధానుల పరిపాలనా వికేంద్రీకరణను రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తుంటే... చంద్రబాబు మాత్రం వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రాజధాని అంశం ఆ రాష్ట్రాలకు సంబంధించిన విషయమని చెప్పినా... చంద్రబాబు ఇంకా డ్రామాలు ఆడిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెటింగ్ ఛైర్మన్ మార్పు గ్రెగొరీ, తదితరులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories