నేడు ఏపీకి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు

CEC: ఏపీలో పర్యటించనున్న సీఈసీ రాజీవ్‌కుమార్‌.. కమిషనర్లు అనూప్‌ చంద్రపాండే, అరుణ్‌ గోయల్‌, అధికారులు

Jyothi
Published on: 8 Jan 2024 9:03 AM IST
Central Election Commission officials for AP today
X

నేడు ఏపీకి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు

CEC: కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు నేడు ఏపీలో పర్యటించనున్నారు. సీఈసీ రాజీవ్‌కుమార్.. కమిషనర్లు అనూప్ చంద్రపాండే, అరుణ్‌గోయల్ పర్యటిస్తారు. సార్వత్రిక ఎన్నికలపై రేపు, ఎల్లుండి కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఇక రేపు రాజకీయ పార్టీల నేతలతో ఈసీ బృందం ప్రత్యేకంగా సమావేశంకానుంది. ఎన్నికల ఏర్పాట్లు, ఓటర్ల జాబితా ఫిర్యాదులపై.. సీఈవో, కలెక్టర్లు, ఎస్పీలతో బృందం సమీక్షించనుంది. ఎన్నికల ఏర్పాట్లపై ఎల్లుండి సీఈవో ప్రజెంటేషన్‌ ఉండనుంది.

Jyothi

Jyothi

Next Story