పీవీపీ ఆస్తులను వేలం వేయనున్న కెనరా బ్యాంకు!

పీవీపీ ఆస్తులను వేలం వేయనున్న కెనరా బ్యాంకు!
x
Highlights

తమకు చెల్లించాల్సిన రూ. 148.90 కోట్ల మొత్తాన్ని వసూలు చేసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పొట్లూరి వరప్రసాద్‌ ఆస్తులను వేలం వేసేందుకు కెనరా...

తమకు చెల్లించాల్సిన రూ. 148.90 కోట్ల మొత్తాన్ని వసూలు చేసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పొట్లూరి వరప్రసాద్‌ ఆస్తులను వేలం వేసేందుకు కెనరా బ్యాంకు సిద్ధమైంది. గతంలో పీవీపీ కేపిటల్‌ లిమిటెడ్‌ సంస్థ కెనరా బ్యాంకు నుంచి రుణం తీసుకుని, తిరిగి చెల్లించడంలో విఫలం కావడంతో ఆ బకాయి వడ్డీతో కలిపి రూ.148.90 కోట్లకు చేరింది. ఎన్ని నోటీసులు పంపినా, డబ్బు చెల్లించకపోవడంతో, ఆస్తులను వేలం వేయాలని బ్యాంకు అధికారులు నిర్ణయించారు.

కాగా, పీవీపీ కేపిటల్‌ 2003లో బ్యాంకు నుంచి ఈ రుణాన్ని తీసుకోగా, దానికి పొట్లూరితో పాటు ఆయన భార్య ఝాన్సీ ష్యూరిటీ ఇచ్చారు. వారి మరో సంస్థ పీవీపీ వెంచర్స్‌ లిమిటెడ్‌ కూడా కార్పొరేట్‌ హామీదారుగా ఉండేందుకు అంగీకరించింది. ఇప్పుడిక రుణం వసూలు కోసం చెన్నై సమీపంలోని పెరంబూరు గ్రామంలో సంస్థ పేరిట ఉన్న దాదాపు 24,355.29 చదరపు మీటర్ల భూమిని వేలం వేస్తున్నట్లు బ్యాంకు అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories