తాడేపల్లిలో కలకలం.. సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలో భారీ పేలుడు

తాడేపల్లిలో కలకలం.. సీఎం క్యాంపు కార్యాలయం  సమీపంలో భారీ పేలుడు
x
Highlights

-గుంటూరు జిల్లా తాడేపల్లి కలకలం -ప్రకాశ్‌ నగర్‌లోని ఓ ఇంట్లో పేలిన ఫ్రిడ్జ్‌ -ఓ మహిళకు తీవ్రగాయాలు -పేలుడు ధాటికి విరిగిపడ్డ ఇంటి తలుపులు, గేటు -విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో గాయపడ్డ మహిళకు చికిత్స

ఏపీ సీఎం జగన్ నివాసముంటున్న తాడేపల్లిలో పేలుడు కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఓ ఇంట్లో ఈ ఉదయం 3గంటల సమయంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఇంటి తలపులు ద్వంసమైయ్యాయి. సీఎం నివాసానికి కొంత దూరంలోనే పేలుడు సంభవించడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.

పేలుడు జరిగిన సమయంలో పైడమ్మ అనే మహిళ ఇంట్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పైడమ్మకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన ఆ మహిళను స్థానికులు విజయవాడలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఇంట్లో ఫ్రిజ్ నుంచి గ్యాస్ లీకవడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లుగా అధికారులు నిర్థారించారు. ఒక్క సారిగా పేలినట్లు పెద్ద శబ్ధం రావడంతో స్థానికులు ఆందోళన చెందారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories