Andhra Pradesh: మూడు రాజధానులుకు మద్దతుగా వైకాపా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

Andhra Pradesh: మూడు రాజధానులుకు మద్దతుగా వైకాపా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
x
Highlights

ఆత్మకూరు: రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల విధానాన్ని చేపట్టారని అభిరాం ఆసుపత్రి...

ఆత్మకూరు: రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల విధానాన్ని చేపట్టారని అభిరాం ఆసుపత్రి అధినేత వైసీపీ నాయకులు డాక్టర్ శ్రావణ్ కుమార్ తెలిపారు. మూడు రాజధానులకు మద్దతుగా ఆత్మకూరు పట్టణంలో వైకాపా నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిపాలన వికేంద్రీకరణ జరగాలని ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు విధానాన్ని చేపట్టారని డాక్టర్ శ్రావణ్ కుమార్ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూడు రాజధానులకు మద్దతుగా ఆత్మకూరు పట్టణం వైకాపా ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఆత్మకూరులోని అభిరామ్ వైద్యశాల నుంచి ప్రారంభించిన ర్యాలీ పురపాలక బస్టాండ్ సత్రం సెంటర్, పీర్ల చావిడి తదితర ప్రాంతాల మీదుగా సాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొండ వెంకటేశ్వర్లు, సూరభాస్కర్ రెడ్డి, మైనార్టీ నాయకులు రహీం మాట్లాడారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు జమీర్ , రిజ్వాన్, కామాక్షి నాయుడు , శ్రీనివాసులు నాయుడు తదితరులు పాల్గొన్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories