భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలి: ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ

భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలి: ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ
x
Highlights

శివరాత్రి సందర్భంగా గోదావరి పుణ్య స్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాటు చేయాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ అన్నారు.

రాజమహేంద్రవరం: శివరాత్రి సందర్భంగా గోదావరి పుణ్య స్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాటు చేయాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆమె తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్, నగరపాలక సంస్థ అధికారులతో కలిసి స్థానిక చింతాలమ్మ ఘాట్ వద్ద పర్యటించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా శివరాత్రికి స్నానపు ఘాట్లను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.

గోదావరిలోకి వెళ్లి స్నానాలు చేయలేని వారికి సౌకర్యంగా వాటర్ జల్లు పైపులను ఏర్పాటు చేయాలని, అలాగే ఘాట్లో ఉన్న శివుడి విగ్రహం నుంచి వచ్చే నీటి జల్లు యంత్రాలను సరి చేయాలని అధికారులకు సూచించారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాను) మాట్లాడుతూ.. శివరాత్రి సందర్భంగా భక్తులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని కోరారు. మాజీ కార్పొరేటర్ మర్రి దుర్గా శ్రీనివాస్, శెట్టి సత్యనారాయణ, చుక్కా శ్రీను, దమ్ము నాగేశ్వరరావు, కడలి త్రిమూర్తులు, చుక్కా నూకరాజు, రేలంగి శ్యాము, సత్తి వెంకట సాయి సందీప్, పులి శ్రీనివాస్, శివారెడ్డి, రెడ్డి, డివిజన్ కమిటీ సభ్యులు, ఏఈ రత్నావల్లి, శానిటరీ సిబ్బంది వారి వెంట ఉన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories