గ్రామ సచివాలయ ఉద్యోగాల మెరిట్ లిస్ట్లు జిల్లాలకు చేరాయి.. అర్హత సాధించిన అభ్యర్ధులు ఏం చేయాలి?

గ్రామ సచివాలయ ఉద్యోగాల మెరిట్ లిస్ట్లు జిల్లాలకు చేరాయి.. అర్హత సాధించిన అభ్యర్ధులు ఏం చేయాలి?
x
Highlights

ఏపీ గ్రామ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం అధికారులు కాల్ లెటర్స్ పంపనున్నారు.

ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల మెరిట్ లిస్టు లు శుక్రవారం రాత్రి ఆయా జిల్లాలలకు అధికారులు పంపించారు. ఈ లిస్టుల ఆధారంగా అటు తరువాత ప్రక్రియను పూర్తి చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ప్రక్రియ ఇలా కొనసాగుతుంది..

- 'సచివాలయ' పరీక్షల ఫలితాలు.. అర్హత మార్కుల వివరాలు పోస్టులు, రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు, మెరిట్ ఆధారంగా జిల్లా ఎంపిక కమిటీ తుది మెరిట్ జాబితాను రూపొందిస్తుంది.

- ఆ జాబితాలను జిల్లాల వారీగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.

- అనంతరం అభ్యర్థుల ఫోన్ నెంబర్లకు SMSలు పంపుతారు.

- జాబితాలో ఉన్న అభ్యర్థులు శనివారం (సెప్టెంబరు 21) నుంచి వెబ్‌సైట్ ద్వారా సర్టిఫికేట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

- తరువాత అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపిస్తారు.

- కాల్ లెటర్లలో పేర్కొన్న విధంగా జిల్లాల్లో ఏర్పాటు చేసే కేంద్రాల్లో సర్టిఫికేట్ల పరిశీలనకు అభ్యర్థులు హాజరుకావాల్సి ఉంటుంది.

- ఇక్కడ పోస్టుల వారీగా సంబంధిత శాఖలకు చెందిన జిల్లా అధికారులు ధ్రువపత్రాలను పరిశీలిస్తారు.

సర్టిఫికెట్ల పరిశీలనకు వెళ్ళే అభ్యర్థులు వీటిని సిద్ధం చేసుకోవాలి..

- ధ్రువపత్రాల పరిశీలనకు వెళ్లే అభ్యర్థులు గెజిటెట్ ఆఫీసర్ సంతకం చేసిన రెండు జతల సర్టిఫికేట్లు, 2 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు వెంటతీసుకెళ్లాలి.

- రెసిడెన్స్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు తప్పనిసరి.

- ఏపీ పునర్విభజన కారణంగా 02.06.2014 - 01.06.2019 మధ్యకాలంలో తెలంగాణ నుంచి ఏపీకి వలసవచ్చిన అభ్యర్థులు స్థానికత కోసం సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది.

- ప్రత్యేక పాఠశాలల్లో చదివిన అంధులు, వినికిడి లోపాలు ఉన్న అభ్యర్థులు తల్లిదండ్రుల రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది.

- ఇక దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, స్పోర్ట్స్, NCC విభాగాలకు చెందిన అభ్యర్థులు సంబంధిత సర్టిఫికేట్లను తీసుకెళ్లాలి.

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాలు సెప్టెంబరు 19న విడదలయ్యాయి. పరీక్షలకు మొత్తం 19,50,630 మంది అభ్యర్థులు హాజరుకాగా.. వీరిలో 1,98,164 మంది అభ్యర్థులు మాత్రమే అర్హత సాధించారు. వీరిలో పురుషులు-1,31,327 మంది; స్త్రీలు-66,835 మంది ఉన్నారు. అర్హత సాధించిన అభ్యర్థులు మెరిట్ జాబితాను రూపొందించి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories