టీడీపీ కార్యాలయం, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులు: జోగి రమేష్ సహా పలువురికి ముందస్తు బెయిల్ నిరాకరణ

AP High Court: జోగి రమేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం తిరస్కరించింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 4 Sept 2024 11:32 AM IST
AP High Court Rejects Jogi Ramesh Petition in Attack on Chandrababu House Case
X

టీడీపీ కార్యాలయం, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులు: జోగి రమేష్ సహా పలువురికి ముందస్తు బెయిల్ నిరాకరణ

AP High Court: జోగి రమేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం తిరస్కరించింది. చంద్రబాబు నాయుడి నివాసంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ దాఖలు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. మరోవైపు 2021 లో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైఎస్ఆర్ సీపీ నాయకులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను కూడా ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

దేవినేని అవినాష్, తలశిల రఘురాం . నందిగాం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. వైఎస్ జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఈ దాడి జరిగింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యాలయంపై దాడి కేసును విచారించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో నమోదు చేసిన సెక్షన్లతో పాటు మరికొన్ని సెక్షన్లను చేర్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ దాడుల్లో పాల్గొన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 14 మంది ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల తర్వాత వీరికి ముందస్తు బెయిల్ ను ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story