PV Sindhu: విశాఖలో రెండెకరాల భూమిని కేటాయించిన ఏపీ సర్కార్

AP Govt Allotted Two Acres Land to PV Sindhu in Vizag
x

AP CM, PV Sindhu:(The Hans India)

Highlights

PV Sindhu: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు విశాఖ లో భూమిని కేటాయిస్తూ..ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ

PV Sindhu: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, భారత స్టార్, తెలుగు తేజం పీవీ సింధుకు భూమిని కేటాయిస్తూ..ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ రూర‌ల్ చినగ‌డిలి గ్రామంలో రెండెకరాల భూమిని కేటాయిస్తున్నట్లు ఉత్వర్వుల్లో పేర్కొంది. ఈ భూమిని ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ‌ నుంచి యువ‌జ‌న స‌ర్వీసులు, క్రీడల‌కు బ‌ద‌లాయించాలని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ స్ధ‌లంలో సింధూ బ్యాడ్మింటన్ అకాడ‌మీ, స్పోర్ట్స్ స్కూలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఉత్వర్వల్లో వెల్లడించింది.

అకాడ‌మీ అవ‌స‌రాల‌ కోస‌మే ఆ భూమి ఉప‌యోగించాల‌ని క‌మ‌ర్షియ‌ల్ అవ‌స‌రాల‌ కోసం ఉపయోగించవద్దని ప్ర‌భుత్వం స్పష్టం చేసింది. అకాడ‌మీ ద్వారా ప్ర‌తిభ ఉన్న పేద‌వారికి లాభాపేక్ష లేకుండా శిక్ష‌ణ ఇవ్వాల‌ని సూచించింది.గతంలోనే పీవీ సింధు అకాడమీకి రెండు ఎకరాలు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా..సీఎం జగన్ కు సింధు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖపట్నంలో అత్యున్నత స్థాయి మౌలిక వసతులతో అకాడమీ ఏర్పాటు చేయాలని తాను భావించడం జరిగిందని, భూమి కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అకాడ‌మీని రెండు ఫేజుల్లో నిర్మించ‌నున్నట్టు ప్రభుత్వానికి సింధు తెలిపింది. ఒక్కో ఫేజ్‌లో 5 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేయ‌నున్నట్టు వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories