విదేశీ పర్యటనకు ఏపీ సీఎం జగన్.. ప్రభుత్వ ఖర్చు 22లక్షలు

విదేశీ పర్యటనకు ఏపీ సీఎం జగన్.. ప్రభుత్వ ఖర్చు 22లక్షలు
x
Highlights

ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జెరూసలెం వెళుతున్నారు. కుటుంబ సమేతంగా అయన విదేశాలకు వెళుతున్నారు.మధ్యాహ్నం 3 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్...

ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జెరూసలెం వెళుతున్నారు. కుటుంబ సమేతంగా అయన విదేశాలకు వెళుతున్నారు.మధ్యాహ్నం 3 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి జగన్ కుటుంబసభ్యులతో కలసి ముంబై వెళతారు. అక్కడ నుంచి నేరుగా జెరూసలేం వెళతారు. ఈనెల 4 వ తేదీ వరకూ అయన అక్కడే వుంటారు.

ముఖ్యమంత్రి పర్యటన అయన వ్యక్తిగత పర్యటనగా అధికారులు చెప్పారు. అయితే, అయన భద్రత నిమిత్తం ప్రభుత్వం 22 లక్షలు ఖర్చు చేయనుంది. ఈ మేరకు ఇజ్రాయెల్ లోని ట్రిపుల్ ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థకు 30591 డాలర్లు చెల్లించనున్నారు. ఈ మొత్తాన్ని చెల్లించడం కోసం హైదరాబాద్ లోని ఎయిర్ ట్రావెల్ ఎంటర్ ప్రిస్జేస్ ఇండియా లిమిటెడ్ కు ప్రభుత్వం 22,52,500 రూపాయలు చెల్లిస్తోంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories