ప్రారంభమైన అంతరాష్ట్ర సర్వీసులు

ప్రారంభమైన అంతరాష్ట్ర సర్వీసులు
x
Highlights

కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు విధించిన లాక్ డౌన్ ను కుదించిన నేపథ్యంలో ఇప్పటికే తక్కువ స్థాయిలో తిప్పుతున్న బస్సులను ఇతర రాష్ట్రాలకు విస్తరించేందుకు...

కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు విధించిన లాక్ డౌన్ ను కుదించిన నేపథ్యంలో ఇప్పటికే తక్కువ స్థాయిలో తిప్పుతున్న బస్సులను ఇతర రాష్ట్రాలకు విస్తరించేందుకు ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. దీనిపై ఇప్పటికే సరిహద్దులో ఉన్న నాలుగు రాష్ట్రాలకు లేఖలు రాయగా, కర్ణాటక ముందుకొచ్చింది. అయితే ఈ స్టేట్ కు పరిమిత సంఖ్యలో బస్సులు తిప్పేలా ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే అనంతపురం డిపో నుంచి బెంగుళూరుకు సర్వీసులు ప్రారంభమయ్యాయి.

లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో భాగంగా కర్ణాటక రాష్ట్రానికి ముందుగా బస్సు సర్వీసులను ప్రారంభించాలని నిర్ణయించింది ఏపీ సర్కార్. ఈ నెల 17వ తేదీ నుండి బెంగళూరు సహా పలు నగరాలకు సర్వీసులను ప్రారంభించాలని నిర్ణయించగా మొదట పరిమిత సంఖ్యలోనే బస్సులను నడపాలని నిర్ణయించింది. మొదట 168 సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆ తర్వాత ప్రయాణికుల రద్దీ దృష్ట్యా నాలుగు దశల వారీగా ఐదు వందలకు బస్సు సర్వీసులను పెంచాలని నిర్ణయించారు. రేపటి నుంచి ఆన్‌లైన్‌లో రిజర్వేషన్లు ప్రారంభం కానున్నాయి. అలాగే పలు సూచనలు కూడా చేసింది ప్రభుత్వం.

కాగా బస్సులు నడిపేందుకు ఇప్పటికే తెలంగాణ, తమిళనాడు, ఒరిస్సా, కర్నాటక ప్రభుత్వాలకు లేఖలు రాసింది ఏపీఎస్ ఆర్టీసీ. కానీ కేవలం కర్ణాటక ప్రభుత్వం నుంచి మాత్రమే అంగీకారం రావటంతో ఈ నెల 17 నుంచి సర్వీసులు నడపాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. బస్సుల్లో భౌతిక దూరంతో పాటు మాస్కులను తప్పనిరిగా ధరించాలన్నారు. అలాగే బస్సుల్లో శానిటైజేషన్ తప్పకుండా చేయాలని ఆర్టీసీ స్పష్టం చేసింది. ఇక రాష్ట్రానికి వచ్చిన వారిలో 5 శాతం మంది ప్రయాణికులకు కరోనా పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే బస్టాండ్‌లలో కూడా కరోనా నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది ఏపీఎస్ఆర్టీసీ.

ఈ క్రమంలో ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు రాష్ట్రం దాటి కర్ణాటకకు పరుగు పెట్టింది. కరోనా లాక్‌డౌన్‌తో డిపోలకే ఆర్టీసీ బస్సులు పరిమితమయ్యాయి. ఆంక్షల సడలింపుతో రాష్ట్రంలో మాత్రమే తిరిగాయి. ఎట్టకేల కు బుధవారం ఏపీ, కర్ణాటక ప్రభుత్వాల అంగీకారంతో ఇరు రాష్ట్రాల మధ్య బస్సుల రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. తొలుత ఆర్టీసీ అధికారులు రూపొందించిన ప్రణాళిక మేరకు కాకుండా బెంగళూరు రూట్‌కు మాత్రమే అనంతపురం రీజియన్‌ నుంచి బస్సుల రాకపోకలు మొదలయ్యాయి. తొలిరోజు రీజియన్‌లోని అనంతపురం డిపో నుంచి 4, కదిరి, తాడిపత్రి, గుంతకల్లు డి పోల నుంచి 2 చొప్పున మొత్తం 10 బస్సులు బెంగళూరు వెళ్లాయి. బెంగళూరు వెళ్లే ప్రయాణికులందరికీ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది సమన్వయంతో ఆర్టీసీ సిబ్బంది ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాతే బస్సుల్లోకి అనుమతించి, పంపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories