ఏపీలో 8లక్షల 20వేలు దాటిన కరోనా కేసులు

ఏపీలో 8లక్షల 20వేలు దాటిన కరోనా కేసులు
x
Highlights

ఏపీలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 84,401 కరోనా టెస్టులు చేయగా 2,886 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.

ఏపీలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గడిచిన 24 గంటల్లో 84,401 కరోనా టెస్టులు చేయగా 2,886 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,20,453 కి చేరుకుంది. అయితే ఇందులో 24,575 యాక్టివ్ కేసులుండగా 7,92,083 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 3,708 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు గడిచిన 24 గంటల్లో కరోనాతో కొత్తగా 17 మంది చనిపోయారు. దీనితో మృతుల సంఖ్య 6,676కి చేరుకుంది.

కృష్ణాలో ముగ్గురు మరణించగా.. అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కడప, విశాఖలో ఇద్దరు చొప్పున మృత్యువాత పడ్డారు. అలాగే, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం, విజయనగరంలో ఒక్కొక్కరు మరణించారు. ఇక జిల్లాల పరంగా కేసులు చూసుకుంటే.. అనంతపుర్ లో 170, చిత్తూరులో 351, ఈస్ట్ గోదావరిలో 371, గుంటూరులో 324, కడపలో 169, కృష్ణాలో 425, కర్నూల్ లో 34, నెల్లూరులో 86, ప్రకాశంలో 134, శ్రీకాకుళం 67, విశాఖపట్నం 113, విజయనగరం 70, వెస్ట్ గోదావరి 469 కేసులు నమోదు అయ్యాయి.. ఇక ఇప్పటివరకు ఏపీలో 80,28,905 కరోనా టెస్టులు నిర్వహించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories