హైదరాబాద్ను వరుస భూ ప్రకంపనలు వణికిస్తున్నాయి. ఇప్పటికే గచ్చిబౌలి, బోరబండలో పలుమార్లు భూమి కంపించింది. ఇప్పుడు తాజాగా వనస్థలిపురం, బీఎన్ రెడ్డినగర్, వైదేహినగర్లో తెల్లవారుజామున భూమిలోనుంచి భారీ శబ్దాలు వచ్చాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ఉదయం 5 గంటల 45 నిమిషాలకు ఒకసారి, 6 గంటల 45 నిమిషాలకు రెండోసారి, 7 గంటల 8 నిమిషాలకు మూడోసారి భూమి కంపించినట్టు కాలనీవాసులు చెబుతున్నారు. వరుస భూ ప్రకంపనలతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.