శివమ్ దూబే నిన్న భారీ స్కోర్ చేయకపోతే భారత్ ఓడిపోయేది..
టీ20 వరల్డ్ కప్లో భాగంగా నెదర్లాండ్స్తో జరిగిన తన చివరి లీగ్ మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించినప్పటికీ, జట్టు ప్రదర్శనపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు తడబడటం, ముఖ్యంగా టాప్ ఆర్డర్ విఫలం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఒకానొక దశలో నెదర్లాండ్స్ భారత్ నిర్దేశించిన టార్గెట్ను ఛేజ్ చేసేంత పని చేసిందని క్రికెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.