Bheemili: భీమిలిలో ఘోర రోడ్డు ప్రమాదం: డ్రైవర్ మృతి!
Bheemili: విశాఖపట్నం జిల్లా భీమిలి పరిధిలో మైనింగ్ అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బీహార్కు చెందిన ట్రాలీ డ్రైవర్ దుర్మరణం చెందాడు.
Bheemili: భీమిలిలో ఘోర రోడ్డు ప్రమాదం: డ్రైవర్ మృతి!
Bheemili: మైనింగ్ అధికారుల నిర్లక్ష్యం ఒకరి ప్రాణాన్ని తీసింది.భీమిలి పోలీసు స్టేషన్ పరిధిలోని సంగివలస శశి కాలేజ్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున 2:40 గంటలకు మైనింగ్/ఆర్.టి.ఓ అధికారులు ఇసుక లారీని తనిఖీల కోసం రోడ్డుపై నిలిపివేశారు.వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రాలీ ఆ లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో ట్రాలీ డ్రైవర్, బీహార్కు చెందిన శివకుమార్ (20) అక్కడికక్కడే మృతి చెందగా,మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. భీమిలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మైనింగ్ అధికారుల తీరుపై లారీ యజమానులు,డ్రైవర్ల అసహనం.
రాత్రి వేళల్లో రోడ్ల మధ్యలో ఉన్నపళంగా లారీలను ఆపి ఇబ్బంది పెట్టడమే కాకుండా,పత్రాలన్నీ సక్రమంగా ఉన్నా వేధిస్తున్నారని మైనింగ్ అధికారులపై డ్రైవర్లు, యజమానులు తీవ్ర అసహనం,ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.