మీకు పీఎఫ్ అకౌంట్ ఉంటే చాలు.. రూపాయి చెల్లించ‌కుండానే రూ. 7 ల‌క్ష‌ల ఇన్సూరెన్స్

Employee Death Insurance: చాలా మంది ఉద్యోగులు పీఎఫ్ (Provident Fund) అంటే పదవీ విరమణ తర్వాత ఉపయోగపడే పొదుపు నిధి అని మాత్రమే భావిస్తారు. అయితే ఈపీఎఫ్ఓ (EPFO) సభ్యులకు మరో కీలక ప్రయోజనాన్ని కూడా అందిస్తోంది. అదే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకం.

Update: 2026-07-03 05:35 GMT

మీకు పీఎఫ్ అకౌంట్ ఉంటే చాలు.. రూపాయి చెల్లించ‌కుండానే రూ. 7 ల‌క్ష‌ల ఇన్సూరెన్స్

Employee Death Insurance: చాలా మంది ఉద్యోగులు పీఎఫ్ (Provident Fund) అంటే పదవీ విరమణ తర్వాత ఉపయోగపడే పొదుపు నిధి అని మాత్రమే భావిస్తారు. అయితే ఈపీఎఫ్ఓ (EPFO) సభ్యులకు మరో కీలక ప్రయోజనాన్ని కూడా అందిస్తోంది. అదే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకం.

ఈడీఎల్‌ఐ పథకం అంటే ఏంటి?

ఈడీఎల్‌ఐ అనేది ఈపీఎఫ్ సభ్యులకు ఆటోమేటిక్‌గా వర్తించే బీమా పథకం. ఉద్యోగి ఈపీఎఫ్‌లో సభ్యుడిగా ఉన్నంతకాలం ఈ రక్షణ కొనసాగుతుంది. ఉద్యోగి మరణించిన తర్వాత, పీఎఫ్ ఖాతాలో నమోదు చేసిన నామినీ లేదా చట్టబద్ధ వారసులకు ఈ బీమా సొమ్ము చెల్లిస్తారు. ఈ పథకం లక్ష్యం ఉద్యోగి మరణం తర్వాత కుటుంబం ఒక్కసారిగా ఆర్థిక ఇబ్బందుల్లో పడకుండా కొంత భరోసా కల్పించడం. ఉద్యోగి జీతం నుంచి ఈ బీమా కోసం ఎలాంటి ప్రీమియం కోత ఉండదు. దీనికి సంబంధించిన మొత్తం వ్యయాన్ని యాజమాన్యమే భరిస్తుంది.

రూ.7 లక్షల వరకు బీమా సొమ్ము ఎలా లభిస్తుంది?

ఈడీఎల్‌ఐ కింద గరిష్ట బీమా ప్రయోజనం ప్రస్తుతం రూ.7 లక్షలు వరకు ఉంటుంది. బీమా మొత్తాన్ని నిర్ణయించే సమయంలో ఈపీఎఫ్ఓ కొన్ని నిబంధనలను అనుసరిస్తుంది. గరిష్టంగా నెలకు రూ.15 వేల వేతనాన్ని లెక్కలోకి తీసుకుంటారు. ఈ లెక్కల ఆధారంగా ప్రాథమిక బీమా మొత్తం నిర్ణయిస్తారు. ఉద్యోగి నిరంతరంగా కనీసం 12 నెలలు ఒకే సంస్థలో పనిచేసి ఉంటే అదనపు బోనస్ ప్రయోజనం కూడా వర్తిస్తుంది. మొత్తం కలిపి నామినీకి గరిష్టంగా రూ.7 లక్షల వరకు చెల్లించే అవకాశం ఉంటుంది. ఈ బీమా ద్వారా లభించే మొత్తం ఆదాయపు పన్ను పరిధిలోకి రాదు. అందువల్ల నామినీకి పూర్తి మొత్తం అందుతుంది.

బీమా క్లెయిమ్ చేయాలంటే ఏం చేయాలి?

ఉద్యోగి మరణించిన తర్వాత నామినీ ఈడీఎల్‌ఐ క్లెయిమ్‌ను దాఖలు చేయాలి. ఇందుకోసం ఫారం 5 IFను పూర్తి చేసి అవసరమైన పత్రాలతో సమర్పించాలి. సాధారణంగా ఈ దరఖాస్తుపై సంస్థ యాజమాన్యం ధృవీకరణ అవసరం ఉంటుంది. ఒకవేళ సంస్థ సహకరించకపోతే లేదా యాజమాన్యం అందుబాటులో లేకపోతే కూడా క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఈ కింది అధికారుల ధృవీకరణతో దరఖాస్తు సమర్పించవచ్చు.

బ్యాంకు మేనేజర్, గెజిటెడ్ అధికారి, స్థానిక ఎంపీ లేదా ఎమ్మెల్యే, మేజిస్ట్రేట్ ఇతర అధికారిక ధృవీకరణకు అర్హులైన అధికారులు. ఆ తర్వాత సంబంధిత ప్రాంతీయ ఈపీఎఫ్ఓ కార్యాలయానికి పత్రాలను అందజేయాలి.

30 రోజుల్లో చెల్లింపు.. ఆలస్యం అయితే వడ్డీ కూడా

ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని పత్రాలు అందిన తర్వాత 30 రోజుల్లోపు క్లెయిమ్‌ను పరిష్కరించాలి. ఒకవేళ నిర్ణీత గడువులోగా క్లెయిమ్‌ను సెటిల్ చేయకుండా ఆలస్యం జరిగితే, ఆలస్యమైన కాలానికి సంవత్సరానికి 12 శాతం వడ్డీతో బీమా మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. దీంతో నామినీలకు క్లెయిమ్ ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా నిబంధనలు అమల్లో ఉన్నాయి.

ఈ-నామినేషన్ అప్‌డేట్ ఎందుకు చాలా ముఖ్యం?

ఈడీఎల్‌ఐ ప్రయోజనం పొందాలంటే పీఎఫ్ ఖాతాలో నామినీ వివరాలు సరిగ్గా నమోదు అయి ఉండాలి. అందుకే ప్రతి ఉద్యోగి తన ఈ-నామినేషన్ వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలించి అవసరమైతే సవరించుకోవాలి. ఉద్యోగి మరణించిన తర్వాత కుటుంబ సభ్యులు ఈడీఎల్‌ఐ బీమాతో పాటు పీఎఫ్, పెన్షన్ ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఇందుకోసం ఫారం 20తో పాటు ఫారం 10C లేదా ఫారం 10Dను కూడా సమర్పించాలి. ఈ మూడు ప్రయోజనాలు ఒకేసారి లభించడం వల్ల కుటుంబానికి ఆర్థికంగా గణనీయమైన మద్దతు లభిస్తుంది. అందువల్ల ఈపీఎఫ్ సభ్యులైన ప్రతి ఉద్యోగి తమ నామినేషన్ వివరాలను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం చాలా అవసరం. అత్యవసర పరిస్థితుల్లో ఇదే కుటుంబానికి పెద్ద ఆర్థిక రక్షణగా మారుతుంది.

Tags:    

Similar News